Corona : విజృంభిస్తున్న కోవిడ్.. ఇద్దరు మృతి!
దేశవ్యాప్తంగా కొత్తగా 257 కేసులు – కేంద్రం అప్రమత్తం
ముంబాయి, సూర్య ప్రతినిధి : కోవిడ్ మళ్లీ తలెత్తుతోంది. 2020లో ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి, ఇప్పుడు మరోసారి దేశంలో తన ఉనికిని గుర్తుచేస్తోంది. తాజాగా భారతదేశంలో 257 కోవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. క్యాన్సర్తో బాధపడుతున్న 59 ఏళ్ల మహిళ ఒకరు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలుడు మరణించారని అధికారులు వెల్లడించారు. వీరిద్దరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఫలితాలు పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
ఈ ఘటనలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను మరోసారి మాస్క్లు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేయడం, సాంఘిక దూరం పాటించడం, అలాగే వాక్సినేషన్ బూస్టర్ డోసులు తీసుకోవడం వంటి జాగ్రత్తలపై దృష్టి సారించమని సూచించింది.
వైద్య నిపుణులు కోవిడ్ తీవ్రత పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తున్నారు.
About The Author

Surya Telugu news, crime investigations, Telugu World news, political analysis, Telugu big stories, Telugu news daily,