ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితులకు సిట్‌ నోటీసులు

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితులకు సిట్‌ నోటీసులు

క్రైమ్ మిర్రర్, అమరావతి : ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో ఈ కేసు నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప నివాసాలు, కార్యాలయాలకు వెళ్లిన సిట్ అధికారులు అక్కడ నోటీసులు జారీ చేశారు. మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణ కోసం విజయవాడలోని సిట్‌ కార్యాలయానికి రావాలని తెలిపారు. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో దాదాపు రూ.3200 కోట్లకు పైగా ముడుపుల రూపంలో చేతులు మారాయన్న ఆరోపణలపై సిట్‌ ప్రాథమిక ఆధారాలు సేకరించింది.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కీలక నిందితులు రాజ్‌ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డితో పాటు మరికొందరి స్టేట్‌మెంట్ల ఆధారంగానూ సిట్‌ సమాచారం సేకరించింది. పాలసీ రూపకల్పన, ఏ స్థాయిలో ఏ అధికారిని నియమించాలనే విషయంలో ధనుంజయరెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్‌ చెబుతోంది.


Also Read : అమరావతిని అస్త్రంగా మలుచుకున్న వైసీపీ - ఏపీ రాజకీయాల్లో ఇదో కీలక అంశం.


మద్యం పాలసీ రూపకల్పన, సరఫరాదారుల నుంచి ముడుపుల వసూళ్లు, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో వీరి పాత్ర ఉందని భావిస్తోంది. పర్సంటేజ్‌ల గురించి చర్చించేందుకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మద్యం కంపెనీ యజమానులతో హైదరాబాద్, తాడేపల్లిలో పలుమార్లు సమావేశం అయ్యారని, వసూలు చేసిన సొమ్మును షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించారని సిట్‌ దర్యాప్తులో ఆధారాలు సేకరించింది. ఆ సొమ్ము అంతిమంగా ఎవరి ఖాతాకు చేరిందనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Tags:

About The Author

Advertisement

Latest News

Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు
సూర్య,  నల్లగొండ బ్యూరో : మిస్వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్దవనం తదితర పర్యటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు...
#Komatireddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి...
పాకిస్తాన్ తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు.?
అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు – మంత్రి పొంగులేటి..!!
భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం
మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు
లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌