బైక్‌ను దగ్ధం చేసిన గుర్తుతెలియని దుండగులు

బైక్‌ను దగ్ధం చేసిన గుర్తుతెలియని దుండగులు

చింతపల్లి-  ప్రభాత సూర్య : ఇంటి ఎదుట గ్రామ పంచాయతీ వద్ద పార్క్ చేసిన టీఎస్ O5 ఇఎస్ 6181 నెంబర్ పల్సర్ బైక్ ను గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి దగ్ధం చే సిన ఘటన శుక్రవారం అర్థరాత్రి సమయంలో  చింతపల్లి మండల పరిధిలోని కిష్టరాయిని పల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.

చింతపల్లి ఎస్ఐ బి. యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం కిష్టరాయనిపల్లి గ్రామానికి చెందిన మోర శ్రీరాములు రోజు మాదిరి గానే యధావిధిగా ఇంటి ఇంటి ఎదుట తన బైక్ పార్క్ చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి1.10 నిమిషాలకు అతని తండ్రి మోర రామచంద్రం మూత్ర విసర్జనకు  బయటికి వెళ్లగా   పల్సర్ బైకు తగలబడుతుండడంతో అది చూసి  కుమారుడైన శ్రీరాములుకు చెప్పాడు. వెంటనే వెళ్లి చూడగా పల్సర్ బైక్ మంటల్లోఖాళీ పోతుండడంతో నీటితో మంటలను ఆర్పేశాడు.

WhatsApp Image 2025-05-03 at 9.10.16 PM అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తన బైక్ కు నిప్పు పెట్టి దగ్ధం చేసినట్లు బాధితుడు ఆరోపించారు.శనివారం బాధితుడు  శ్రీరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు
సూర్య,  నల్లగొండ బ్యూరో : మిస్వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్దవనం తదితర పర్యటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు...
#Komatireddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి...
పాకిస్తాన్ తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు.?
అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు – మంత్రి పొంగులేటి..!!
భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం
మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు
లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌