తెలంగాణ బోనస్‌కు కన్నేసిన దళారులు - ఆంధ్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న ధాన్యం లారీలు పట్టివేత

తెలంగాణ బోనస్‌కు కన్నేసిన దళారులు - ఆంధ్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న ధాన్యం లారీలు పట్టివేత

తెలంగాణలో ఎంఎస్‌పీతో పాటు బోనస్ ఉండటంతో దళారులు, మధ్యవర్తులు ఆ ప్రోత్సాహాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వారు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ధాన్యాన్ని లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు,

మిర్యాలగూడ, ప్రభాత సూర్య : తెలంగాణలో ప్రభుత్వం ధాన్యానికి ప్రకటించిన రూ.500 బోనస్‌ను లక్ష్యంగా చేసుకొని, ఆంధ్రప్రదేశ్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఏడు ధాన్యం లారీలను పోలీసులు పట్టుకున్నారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడిన డీఎస్పీ కె. రాజశేఖర్ రాజు ఈ విషయాన్ని వెల్లడించారు.“తెలంగాణలో ఎంఎస్‌పీతో పాటు బోనస్ ఉండటంతో దళారులు, మధ్యవర్తులు ఆ ప్రోత్సాహాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వారు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ధాన్యాన్ని లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు,” అని డీఎస్పీ తెలిపారు.

IMG-20250504-WA0008
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డి.ఎస్.పి రాజశేఖర్ రాజు
IMG-20250504-WA0008
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్పి రాజశేఖర్ రాజు

మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని వాడపల్లి, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 100-150 లారీలు తిరస్కరించామని, అయినప్పటికీ కొన్ని మార్గాల్లో అక్రమ రవాణా కొనసాగుతోందన్నారు.శనివారం వాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద ఆరు లారీలు, సుమారు 2,200 బస్తాల ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. "ప్రభుత్వాన్ని మోసం చేయాలనే ఉద్దేశంతో అక్రమ రవాణాకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు.ఈ సమావేశంలో మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐలు లక్ష్మయ్య, బిక్షం, సంజీవరెడ్డి, ఏఎస్ఐ రాములునాయక్ పాల్గొన్నారు.

About The Author

Advertisement

Latest News

Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు
సూర్య,  నల్లగొండ బ్యూరో : మిస్వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్దవనం తదితర పర్యటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు...
#Komatireddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి...
పాకిస్తాన్ తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు.?
అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు – మంత్రి పొంగులేటి..!!
భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం
మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు
లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌