ఘనంగా మూడవ బెటాలియన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

ఇబ్రహీంపట్నం(క్రైమ్ మిర్రర్):-IMG-20250815-WA0042IMG-20250815-WA0041

ఇబ్రహీంపట్నంలోని 3వ బెటాలియన్ ఆధ్వర్యంలో, 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో, 3వ బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జామీల బాష, జాతీయ పతాకాన్ని ఎగురవేసి, హంగు ఆర్భాటాలతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహానీయుల త్యాగాలను మనం ఎప్పటికీ మరవలేమన్నారు. నేటి సమాజంలో శాంతిభద్రతలను కాపాడే బాధ్యత పోలీసులదేనని, ప్రజలందరూ స్వేచ్ఛగా, భయభ్రాంతులు లేకుండా జీవించేందుకు పోలీసు వ్యవస్థ నిరంతరం కృషి చేయాలని ఈ సందర్బంగా పేర్కొన్నారు. అనంతరం సేవా పథకాలు పొందిన ఆర్.బాలు, ఆర్ఎస్ఐ జె. జానకీరాములు, ఏఆర్ఎస్ఐ లను ఆయన అభినందించారు. ఈ వేడుకల్లో 3వ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ శ్రీనివాస రావు, అసిస్టెంట్ కమాండెంట్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Advertisement

Latest News