ప్రజలకు ఉపయోగపడేలా ఉపాధి హామీ పనులు చేపట్టాలి.!
పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ సృజన
ఉపాధి హామీ కింద పొలాలకు కట్టలు వేసుకోవడమే కాకుండా చెక్ డ్యామ్ ల నిర్మాణాలను పెద్ద మొత్తంలో చేపట్టలని ఆమె అధికారులు సూచించారు.
ప్రభాత సూర్య / వికారాబాద్ జిల్లా ప్రతినిధి: ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ సృజన అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం చీమల్ దారి గ్రామంలో,నవాబ్ పెట్ మండలం వట్టిమీనేపల్లి, నవాబ్ పేట్, తిమ్మారెడ్డిపల్లి గ్రామాలల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో కమీషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖిగా మాట్లాడుతూ... ఉపాధి హామీ పథకం కింద ఎన్ని రోజులు పని చేస్తున్నారని, రోజుకు 307 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కింద పొలాలకు కట్టలు వేసుకోవడమే కాకుండా చెక్ డ్యామ్ ల నిర్మాణాలను పెద్ద మొత్తంలో చేపట్టలని ఆమె అధికారులు సూచించారు. ఆదాయ వనరులు కల్పించే పంటలు సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని ఆమె సూచించారు.

ఉద్యానవన పంటలతో పాటు మునగ,జామ , మామిడి, సీతాఫల్ పంటలను సాగు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని ఆమె అధికారులు సూచించారు.పంచాయతి రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ పర్యటన భాగంగా అవెన్యూ ప్లాంటేషన్, కాంపోస్ట్ షెడ్, ఫాం పాండ్ నిర్మాణ పనులు పరిశీలించారు.నవాబ్ పెట్ మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కింద నిధులతో చేపట్టిన పౌల్ట్రీ ఫాం ను కమిషనర్ ప్రారంభించారు. కమిషనర్ పర్యటనలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్,అదనపు కలెక్టర్ సుధీర్, డిఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ జయసుధ, పంచాయత్ రాజ్ ఉమేష్, ఎంపీడీఓలు విజయలక్ష్మి, అనురాధ, ఉపాధి హామీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.